తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,579 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 770 మంది మరణించారు. హైదరాబాద్ లో కొత్తగా 296 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 23,737 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 84,163 గా ఉన్నాయి. హైదరాబాద్ లో 48,461 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకూ నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.