స్నేహితులే కదా అని నమ్మి వారి వెంట బర్త్ డే పార్టీకి వెళ్లిన పాపానికి నయ వంచన చేసిన కథనమిది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి నివాసముంటుంది. సికింద్రాబాద్లోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమె ఇంటి దగ్గరలో ఉంటున్నజోసఫ్, నవీన్ రెడ్డి, రాములు ఆ విద్యార్థినితో స్నేహంగా మెలిగేవారు. చాలా రోజులుగా నమ్మకంగా ఉంటున్నారు.
ఆ విద్యార్థిని ఈ నెల 5వ తేదీన టర్మ్ ఫీజు చెల్లించేందుకు కళాశాలకు వెళ్లింది. ఆ సమయంలో జోసెఫ్ ఫోన్ చేసి తన పుట్టినరోజు అని నమ్మబలికి, బర్త్ డే సెలబ్రేషన్ కి రావాలని పిలిచాడు. ఫ్రెండ్స్ రమ్మనటంతో నమ్మి వారి వెంట వెళ్లింది ఆ యువతి. వారు ఆమెను కేపీహెచ్బీ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి, మత్తుమందు కలిపిన కేక్ తినిపించారు. సృహా తప్పిపోయాక సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
కానీ బాధిత యువతి అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలవ్వడంతో అత్యాచారం విషయం బయటకు తెలిసింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం కింద హైదరాబాద్ పోలీసుల కేసు నమోదు చేశారు.