యా సమావేశంలో ఎన్నికల కమిషనర్ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు అందించింది. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది.
తాను చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోగా వ్యక్తిగతంగా గాని, ప్రతినిధి ద్వారా గాని వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం ఉదయం మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇంటింటికీ రేషన్పై కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని టీడీపీ కుట్ర చేస్తోందని.. అందులో భాగంగానే రేషన్ వాహనాలు నిలిపివేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారని ఆరోపించారు.
చంద్రబాబు ఎస్ఈసీని తిట్టడం ఒక డ్రామా అని కొడాలి నాని విమర్శించారు.
ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు.